వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇటీవల ఓ జిమ్లో కత్తిపోట్లకు గురైన తెలంగాణ యువకుడు వరుణ్రాజ్ పుచ్చా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏండ్ల వరుణ్.. షికాగోలోని వల్పరైసో యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. గత నెల 29న జోర్డాన్ ఆండ్రాడే అనే వ్యక్తి వరుణ్పై కత్తితో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన వరుణ్ను ఫోర్ట్వేన్ దవాఖానకు తరలించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ వరుణ్ మరణించినట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా ఈ నెల 16న యూనివర్సిటీలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా వరుణ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ 90 వేల యూఎస్ డాలర్ల నిధుల సేకరణ చేపట్టింది.