కూసుమంచి, ఫిబ్రవరి 8: ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్తోపాటు మరో ముగ్గురు ఆ లయ పాలక మండలి సభ్యులను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండలం గోపాలరావుపేటకు చెందిన డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ కొనేండ్ల క్రితం కూసుమంచి మండలం జీళ్లచెర్వు సీతారామచంద్ర స్వామి ఆలయ పరిధిలోని గుట్టలు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వించి సొమ్ము చేసుకున్నారని, ఆయనతోపాటు ఆలయ పాలక మండలి చైర్మన్ చెన్నా వెంకన్న, సభ్యులు కొండా వెంకన్న, చింతలపాటి రామకృష్ణకూ ప్రమేయం ఉన్నదని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూసుమంచి పోలీసులు బుధవారం అర్ధరాత్రి వారిని అరెస్ట్ చేసి ఖమ్మం కోర్టులో హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు. వారి అరెస్ట్ను నిరసిస్తూ ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నాయకులతో ధర్నా చేశారు.