హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఖాజా ముజీబుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ఉర్దూ అకాడమీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ పదవీ కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఖాజా ముజీబుద్దిన్ ను రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.