హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రైం మోసాలకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆపరేషన్ క్రాక్డౌన్కు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్ బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. బుధవారం నిర్వహించిన ఆపరేషన్లో 16 జిల్లాల్లో 137 బ్యాంకుల్లో 1,888 అనుమానాస్పద అకౌంట్లను గుర్తించినట్టు తెలిపారు. గోదావరి పుష్కరాలకు పటిష్ట భద్రత కల్పించాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్తో కలిసి వివిధ జిల్లాల పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ పోలీస్శాఖ అతిథ్యమిస్తున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్-2026 ఏర్పాట్లపై డీజీపీ శివధర్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.