హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్-యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో కవిత సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై అభిప్రాయాల్ని పంచుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు.
దళితబంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, పరిశ్రమలు స్థాపించే స్థాయికి వారు ఎదిగారని పేర్కొన్నారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించేందుకు శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. గర్భిణులకు ప్రభుత్వం నెలకు రూ.1000 అందిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ విద్యావ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని, క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివే మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందని గుర్తు చేశారు.
మాడల్ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దేశంలో ఎకడా లేని విధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్కు 30 శాతం రిస్ అలవెన్సు అందిస్తున్నామని, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.20 వేల వేతనం లభిస్తున్నదని తెలిపారు. సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచన అని కవిత వివరించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పడంలో సందేహమే లేదని, తెలంగాణ ఏర్పాటు కావడమే తన లక్ష్యమని, పదువులు ముఖ్యం కాదని కేసీఆర్ అన్నారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు తాను మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు. తాను ప్రచారం చేస్తున్నప్పుడు ఓ గ్రామీణ మహిళ తనకు ఒక రూ. 1000 ఆదాయం ఎకువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పుకు కృషి చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
అయితే, నేరుగా రాజకీయాల్లోకి రాకుండా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించానని తెలిపారు. ఆ సంస్థ ద్వారా మహిళా సాధికారతకు కృషి చేశానని.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించామని పేర్కొన్నారు. ముఖ్యంగా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా పెద్దఎత్తున నిర్వహిస్తూ వచ్చామని వివరించారు. ప్రస్తుతం 65-70 దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేశానని తెలిపారు. ప్రజా జీవితంలో ప్రజలు మనల్ని చూస్తారు తప్పితే మన కుటుంబ నేపథ్యాన్ని కాదని పేర్కొన్నారు.
తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరుచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని కవిత తెలిపారు. దేశంలో అన్నిరంగాల్లో మహిళల ప్రాతినిధ్యం తకువగా ఉన్న విషయాన్ని తానే అనేక సందర్భాల్లో గర్తించానని చెప్పారు. ఈ ప్రపంచంలోని మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష ఉందని, సమాన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. భారత్లో రాజకీయ పార్టీల్లోనూ మహిళలకు తకువ ప్రాతినిధ్యం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం నిరుడు నవంబరు నుంచి తాను ఉద్యమాన్ని ఉధృతం చేశానని, ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో భారీ ధర్నా, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించానని గుర్తు చేశారు.
గతంలో మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీతో సహా దాదాపు 13 పార్టీల నేతలు ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారని తెలిపారు. ఆ పార్టీల నేతల సంతకాలతో తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి కూడా పంపించామన్నారు. తమ పార్టీ తరఫున పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని, ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్కు ముడిపెట్టడం సరికాదని సూచించారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55-57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా సమావేశాలు నిర్వహిస్తే పురుషులే ఎక్కువ కనిపిస్తున్నారని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.