హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవడం కోసం ఎంత వరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి హకులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర హకులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరి.. కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హకులకు గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు కేఆర్ఎంబీకి నాగార్జునసాగర్, శ్రీశైలంసహా కృష్ణా నదిమీద ఉన్న ప్రాజెక్టులన్నింటినీ అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చికుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏం మాట్లాడిండో చూసినం. మన సభకు ఎట్లా అనుమతివ్వరో చూద్దాం. మనం ఆరు నూరైనా నల్లగొండలో సభ పెట్టి తీరుతాం. అద్భుతంగా, బ్రహ్మండంగా ఏర్పాట్లు చేసుకుందాం. సభ నిర్వహణకు ప్రతీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను కూడా వేసుకుందాం’ అని సీఎం చెప్పారు.
నల్గొండ- రవీందర్సింగ్ (సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్), సూర్యాపేట-జోగురామన్న (మాజీ మంత్రి), హుజూర్నగర్- క్రాంతి కిరణ్ (మాజీ ఎమ్మెల్యే), మునుగోడు- నందికంటి శ్రీధర్ (ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్), ఆలేరు- కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (మాజీ ఎమ్మెల్యే), నకిరేకల్- బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే), కోదాడ- తక్కళ్లపల్లి రవీందర్రావు (ఎమ్మెల్సీ), భువనగిరి- సుంకె రవిశంకర్ (మాజీ ఎమ్మెల్యే), జీవీ రామకృష్ణారావు (కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు), దేవరకొండ- పన్యాల భూపతిరెడ్డి, తుంగతుర్తి- ఆశన్నగారి జీవన్రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), మిర్యాలగూడ- సింధూ ఆదర్శ్రెడ్డి (పటాన్చెరు నియోజకవర్గ నేత), నాగార్జునసాగర్- జాజాల సురేందర్ (మాజీ ఎమ్మెల్యే).