HomeTelanganaKcr Warning To Telangana Police In Sultanpur Public Meeting 2
KCR | పోలీసులు దౌర్జన్యం బంద్ జేయాలె.. బీఆర్ఎస్ అధినేత వార్నింగ్
KCR | పోలీసులు వారి విధులను మాత్రమే నిర్వహించాలని, దౌర్జన్యాలు ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ‘మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమవుతుందో ఆలోచించాలి’ అని హెచ్చరించడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): పోలీసులు వారి విధులను మాత్రమే నిర్వహించాలని, దౌర్జన్యాలు ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ‘మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమవుతుందో ఆలోచించాలి’ అని హెచ్చరించడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పోలీసులకు సంబంధించి కేసీఆర్ చేసిన ప్రతి మాటకు ప్రజల నుంచి భారీ స్పందన కనిపించింది. సుల్తాన్పూర్లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఒక్కరినైనా వేధించినమా?
‘ఇవాళ సభలో ఉన్నోళ్లు తక్కువే. నేను వస్తున్నప్పుడు 150 లారీలను దాటుకొని వచ్చినా. పోలీసోళ్లు లారీలను ఆపుతున్నారు.నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయండి. పదేండ్లు మేము కూడా అధికారంలో ఉన్నాం. అమాయకులను కొట్టడం, బెదిరించడం వంటివి చేయలేదు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను పీకేయడమేనా మీ డ్యూటీ. పోలీసు మాట ఎత్తంగనే ప్రజలు ఎలా గోల చూస్తున్నారో చూడండి. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తది. అప్పుడు మీ గతి ఏమైతదో ఆలోచన చేసుకోవాలి. పదేండ్లు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఒక్కరోజైనా దౌర్జన్యం చేసినమా? ఎవరినైనా వేధించినమా? మరెందుకు మీరు మితిమీరిన పనులు చేస్తున్నారు. పోలీసు సోదరులారా దయచేసి మానుకోండి. మేము అన్నీ రికార్డు చేస్తున్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలె.
మాధవరావు ఘటనపై కమిటీ వేయండి
ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన మా కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టిండని, ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారు. ఆయన ఇవాళ కరీంనగర్ జైలులో ఉన్నాడు. డీజీపీకి గౌరవం ఉంటే మాధవరావు ఘటనపై సీనియర్ ఆఫీసర్తో స్పెషల్ కమిటీ వేయాలి. ఎస్ఐ, ఇన్స్పెక్టర్ ఎలా దౌర్జన్యానికి పాల్పడ్డారో వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి. మేము న్యాయస్థానం తలుపులు తడతామని హెచ్చరిస్తున్నా. మేము కూడా మస్తుగా చూసినం. నేను కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రిగా పనిచేశా. ఇదే జిల్లాలో 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ముఖ్యమంత్రిగా పనిచేసినా. కానీ నేను పోలీసులతో ఎన్నడూ దౌర్జన్యాలు చేయించలేదు. మీరు అనసవరంగా వీటిల్లోకి రాకండి. రాజకీయాలు చేసేవాళ్లు చేస్తారు. మీరు అనవసరంగా ఇందులోకి రాకండి. మీకు అవసరం లేదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
సల్వాజి మాధవరావుపై అక్రమ కేసు ఇలా..
ధర్మారం, ఏప్రిల్ 16 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి సల్వాజి మాధవరావు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు పోలీసులు అక్రమంగా కేసు నమోదుచేశారు. అంతేగాక కరీంనగర్ జైలుకు తరలించారు. గత నెల 18న సాయంత్రం మాధవరావు తనను కులం పేరిట దూషించారని ధర్మారానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు సోగాల తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఈ నెల 3న ఏసీపీ జీ కృష్ణ సాక్షులను విచారించి కులం పేరిట దూషించినట్టుగా నిర్ధారించారు. దీంతో ఏసీపీ ఆదేశాల మేరకు ఈ నెల 12న మాధవరావును పోలీసులు అరెస్ట్ చేసి నందిమేడారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆయనకు ఈ నెల 25 వరకు రిమాండ్కు పంపించారు.