KCR | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేసి విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరుదైన ఘనత సాధించారు. గజ్వేల్ నుంచి కేసీఆర్కు ఇది వరుసగా మూడో గెలుపు. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట నుంచి కేసీఆర్ ఆరు ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు గజ్వేల్ నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు.
ఈ గెలుపుతో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ సాధించిన నేతల్లో.. గోషామహల్ నుంచి రాజాసింగ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్లో మాగంటి గోపినాథ్, సూర్యాపేటలో జగదీశ్ర్రెడ్డి, కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు, సికింద్రాబాద్లో పద్మారావు, సనత్నగర్లో తలసాని శ్రీనివాస్యాదవ్, కుత్బుల్లాపూర్ నుంచి కేపీ వివేకానంద్, మధిరలో భట్టి విక్రమార్క, హుజూర్నగర్లో ఉత్తమ్కుమార్రెడ్డి, కార్వాన్లో కౌసర్ మెహియుద్దీన్, మేరాజ్ జాఫర్ హుస్సేన్ (రెండుసార్లు నాంపల్లి, ఈ దఫా యాకత్పుర) నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. పటాన్చెరులో గూడెం మహిపాల్రెడ్డి, చేవెళ్ల నుంచి కాలే యాదయ్య వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆదివారం సాయంత్రం కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ఆ వెంటనే గవర్నర్ దానిని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను కోరినట్టు పేర్కొంటూ గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.