చొప్పదండి, అక్టోబర్ 1: తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలపై బీజేపీ ఎంపీటీసీ సభ్యుడు, కిసాన్మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ సర్కారు పార్టీలకతీతంగా పథకాలను వర్తింపజేస్తున్నదని కొనియాడారు. ఆదివారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధించిన తర్వాతనే పల్లెలన్నీ బాగుపడ్డాయని ప్రశంసించారు. రాగంపేటలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు.