హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ (కేశవచంద్ర రమావత్) సినిమాలోని తెలంగాణ తేజం పాటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో చిత్ర బృందం ఆయనను కలిసింది. కేసీఆర్ (కేశవచంద్ర రమావత్) సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆయనతోపాటు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్దార్ సుజాత, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేశ్ తదితరులు కేసీఆర్ను కలిశారు. కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎంపీ సంతోష్కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.