హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధుడుగా, అనంతర కాలంలో తెలంగాణ స్వయంపాలన కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమనేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. రాజకీయవేత్తగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు తెలంగాణ సోయి కలిగిన ప్రతి ఒకరికీ ఆదర్శనీయమని కొనియాడారు. శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురసరించుకుని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. మంత్రి పదవిని త్యాగం చేసి నాటి తెలంగాణ వ్యతిరేకులకు సవాల్ విసిరిన బాపూజీ పట్టుదల తన మలిదశ రాష్ట్ర సాధన పోరాటానికి స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హకులు, రక్షణ స్వరాష్ట్ర సాధనతోనే సాధ్యమని, తాను రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు బాపూజీ తనకు అండగా నిలిచిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. స్వయంపాలన కోసం తాను తొలి అడుగు వేసిన జలదృశ్యం ఉద్యమ ప్రస్థానం నుంచి, స్వరాష్ట్రంగా నిలిపి పదేండ్ల బీఆర్ఎస్ పాలన సాధించిన ప్రగతి ప్రస్థానం చరిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు.
బడుగుబలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన జీవితకాలం పోరాడిన బాపూజీ ఆకాంక్షలకు అనుగుణంగా పదేండ్ల పాలన కొనసాగిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. బాపూజీ కృషిని భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆదర్శాలను కొనసాగించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. తెలంగాణ సబ్బండ కులాల ఆత్మగౌరవాన్ని కాపాడటం, అన్ని రంగాల్లో వారి హకులకు రక్షణ కల్పించడం, స్వయంపాలనలో వారిని భాగస్వామ్యులను చేయడమే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనం అందించే ఘననివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.