ప్రమాద సమయంలో ‘స్లీపింగ్ బ్యాగ్’ ఉండటంతో శిశువు సురక్షితం
ఇల్లందు రూరల్, మార్చి 14: ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన ఎస్కే జోయబ్ భార్యతోపాటు ఐదు నెలల పాప జోయాతో ద్విచక్రవాహనంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మర్రిగూడేనికి బయల్దేరాడు. రేపల్లెవాడ సమీపంలో ఎదురుగా వస్తు న్న ఓ గుర్తుతెలియని వాహనం.. వీరి బైక్ను ఢీకొట్టిం ది. ఈ ఘటనలో బైక్ ముళ్లపొదళ్లలోకి దూసుకెళ్లగా దంపతులిద్దరికీ తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకొన్నారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ క్రమంలో వారికి చిన్నారి ఏడుపు వినిపించింది. పొదల్లో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా ఉన్న శిశువును చూసి బయటకు తీశారు. శిశువు కేసీఆర్ కిట్ ‘స్లీపింగ్ బ్యాగ్’లో ఉండటంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. పాప తల్లిదండ్రులను ఇల్లెందులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జోయబ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం దవాఖానకు రిఫర్ చేశారు. కేసీఆర్ కిట్ నిండు ప్రాణాన్ని కాపాడిందని అక్కడున్న వారు చర్చించుకోవడం గమనార్హం.