టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్
హన్మకొండ, మార్చి 26: తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు బాసటగా ఉంటారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ టీఎన్జీవో భవన్లో జరిగిన వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల టీఎన్జీవోల జిల్లా కార్యవర్గ ఎన్నికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 29 రాష్ర్టాల్లో ఇచ్చిన మాట తప్పని సీఎం ఒక్క కేసీఆరేనని స్పష్టం చేశారు. ఉద్యోగులను సంతోషపరిచేలా, ఆశించినదానికంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో 30శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకున్న సీఎం కేసీఆర్కు యావత్తు తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, కార్మికులు, కాం ట్రాక్టు, అవుట్సోర్సిం గ్ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సూచన మేరకు అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకొనేందుకు ఉద్యోగులు అవసరమైతే ఒక గంట ఎక్కువ పని చేస్తామని చెప్పారు.