సిద్దిపేట : నాణ్యమైన బోధన, కఠోర సాధనతో ఎంతోమంది నిరుపేద యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు దారి చూపించిన కేసీఆర్ కోచింగ్ సెంటర్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో మార్మోగింది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సొంత ఖర్చులతో ఆరేండ్లుగా నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్కు ఎనలేని కీర్తి దక్కింది. శుక్రవారం విడుదలైన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అత్యుత్తమ ఫలితాలు ఈ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సాధించారు. 617 మందికి 518 మంది విద్యార్థులు టెట్ పేపర్- 1, పేపర్- 2 లో అర్హత సాధించడం విశేషం. నూటికి 84 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి ఈ కోచింగ్ సెంటర్ రికార్డునే తిరగరాశారు. రాష్ట్రంలో పేపర్- 1 లో 32 శాతం, పేపర్- 2లో 49 శాతం అర్హత ఉండగా.. ఈ కోచింగ్ సెంటర్లో ఏకంగా 84 శాతం రిజల్ట్ రావడం చెప్పుకోదగిన అంశం.
నేను మొదట్లో హైదరాబాద్లోని ఒక కోచింగ్ సెంటర్కు వెళ్లాను. కానీ అక్కడ బాగా చెప్పలేదు. ఆ తర్వాత హరీశ్రావు సార్ సిద్దిపేటలో కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలిసి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాసయ్యాను. మొదటి క్లాస్ విన్నాక ఇక్కడే శిక్షణ పొందాలని డిసైడ్ అయ్యాను. ప్రతీరోజు అన్నం పెట్టి, మెరుగైన శిక్షణ అందించారు. ఫ్యాకల్టీ కూడా అద్బుతంగా చెప్పారు. నాకు గతంలో 109 మార్కులు రాగా ఇప్పుడు 117 మార్కులు వచ్చాయి. ఉపాధ్యాయురాలిని కావాలనే నా లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నాను. హరీశ్రావు సార్కు చాలాచాలా థ్యాంక్స్. – కొటారికారి మీనా, 117 మార్కులు, స్టేట్ ర్యాంకర్