తిమ్మాపూర్, ఏప్రిల్ 18 : కాంగ్రెస్ సమావేశంలో కయ్యం మొదలైంది. గురువారం కరీంనగర్ జిల్లా అల్గునూరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అం తర్గత విభేదాలు మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే బహిర్గతమయ్యాయి. మానకొండూ రు మండలం లక్ష్మీపూర్లోని పోచమ్మ గుడికి వెళ్లే దారిని అదే గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి కబ్జా చేశాడని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఎడ్ల భద్రయ్య.. రెండు నెలల కిందట ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురికాగా రూ.2.5 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. తమను కాదని మహేందర్కు ఎల్వోసీ ఎలా ఇచ్చారని భద్రయ్య ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే సభ పైనుంచి కిందికి దూకి కార్యకర్తపైకి దూసుకెళ్లాడు. పక్కనే ఉన్న మంత్రి పొన్నం ఎమ్మెల్యేను నిలువరించే ప్రయత్నం చేశారు. కార్యకర్తపైకి ఎమ్మెల్యే దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.