MLC Kavitha | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్న బీసీల పోరాటానికి భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు. నగరంలోని బీసీ దళ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో దండ్ర మాట్లాడారు.
బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. బీజేపీ ఇకనైనా తన సిద్ధాంతాలను మార్చుకోవాలని సూచించారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీలు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.