హైదరాబాద్ జనవరి 27 (నమస్తే తెలంగాణ): భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ విభాగం నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. నేషనల్ గైడ్స్ కమిషనర్ హోదాలో ఎమ్మెల్సీ కవిత ఏడాదిపాటు సేవలు అం దించనున్నారు. 2015 నుంచి సౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఆమె అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు పొందారు. సౌట్స్ అండ్ గైడ్స్లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వా మ్యం పెరిగేలా కృషి చేస్తానని కవిత పేర్కొన్నారు.
సింగరేణి కార్మిక సంక్షేమానికి టీబీజీకేఎస్ కృషి
దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసి, సింగరేణి నిర్వీర్యానికి బీజేపీ ప్రభుత్వ యత్నాలకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ కొట్లాడుతున్నదని ఆమె ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.