కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పరిశుభ్రత నెల కొంది. తడి, పొడి చెత్తలను ఎరువులుగా తయారు చేసి పంచాయతీలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం చేపట్టారు.
ప్రభుత్వం క్లస్టర్ల వారీగా చేపట్టిన రైతువేదికల నిర్మాణం పూర్తై అన్నదాతలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు, పెద్దలు ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. వైకుంఠధామాల నిర్మాణాలతో అంతిమ సంస్కారాల సమస్యలు కూడా తీరాయి.
హరితహారంలో భాగంగా గ్రామాల్లోని వీధులు, రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్తో గ్రామా లు హరిత శోభను సంతరించుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే పల్లెలు పచ్చదనంగా మారి ప్రజలకు ఆహ్లాదాన్నిపంచుతున్నాయి.