హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డికి తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) మద్దతు ప్రకటించింది. ఆదివారం కాటేపల్లి జనార్దన్రెడ్డికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, రహ్మతుల్లా మద్దతు లేఖను అందజేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా సేవలందించిన జనార్దన్రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు.