హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 24న ఒకేగంటలో మూడు కోట్ల మొక్క లు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. రాజకీయ నాయకుల జన్మదినాన్ని పురస్కరించుకొని రోడ్ల నిండా కటౌట్లు, పోస్టర్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా, జనహితం, భవిష్యత్తు తరాల కోసం హరిత తెలంగాణ కార్యక్రమాన్ని తలపెట్టిన ఎంపీ సంతోష్కుమార్ను ఆయన అభినందించారు.
కార్మిక సంక్షేమభవన్లో హరితహారం
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్డులోని కార్మిక సంక్షేమభవన్లో సోమవారం హరితహారం నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగులు వంద మొక్కలు నాటా రు. సంయుక్త కార్మిక కమిషనర్ చతుర్వేది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అసంఘటిత సామాజిక భద్రతామండలి చైర్మన్ దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.