Kasani Gnaneshwar | తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్ సోమవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో మనస్థాపంతో రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు కోరితేనే ఖమ్మంలో మీటింగ్ను ఏర్పాటు చేశానని, తర్వాత నిజామాబాద్లో మీటింగ్ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ టీడీపీ అని, 41వ ఆవిర్భావ సభను పెట్టించారన్నారు. చంద్రబాబును జైలులో కలిసి వచ్చానని.. లోకేశ్కి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదన్నారు.
అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకునే వాళ్లే ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో నిలబడడం లేదని చెప్పారన్నారు. తనను పార్టీలోకి ఎందుకు పిలిచారని చంద్రబాబును ప్రశ్నించానని.. అభ్యర్థులు ఉండి తయారై ఉన్నారన్న ఆయన.. క్యాడర్కు పార్టీలో ఉండి న్యాయం చేయలేనన్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. క్యాడర్తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనివ్వకపోవడానికి కారణాలను చంద్రబాబు చెప్పడం లేదని పేర్కొన్నారు.