హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధిప్లాంట్లతో దేశంలోని వేల గ్రామాల్లో ప్రజల దాహార్తి తీరుస్తున్న మహబూబ్నగర్కు చెందిన ఎం కరుణాకర్రెడ్డికి వాటర్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు దక్కిం ది. ముంబైకి చెందిన ప్రసిద్ధ గ్రీన్ మాపెల్ ఫౌండేషన్ సంస్థ ఈ నెల 16న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డును అందజేయనున్నది.
కరుణాకర్రెడ్డి దేశవ్యాప్తంగా 14 వేలకి పైగా కమ్యూనిటీ నీటి శుద్ధిప్లాంట్లు నెలకొల్పారు. పశ్చిమ బెంగాల్, జారండ్, కశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపత్తుల వేళ సంచార నీటి శుద్ధి కేంద్రాలతో బాధితులకు తాగునీరు అందించారు. అవార్డుకు తనను ఎంపిక చేయడంపట్ల సంస్థకు కరుణాకర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.