ధర్మపురి : శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హరిహర క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. గోదావారి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి సంకల్పాది పూజలు జరిపించుకున్నారు. గోదావరిలో కార్తీక దీపాలు వదిలి భక్తి ప్రవత్తులు చాటుకున్నారు. అనంతరం ప్రధాన దేవాలయమైన లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల ఉసిరిక చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. బ్రాహ్మణులకు కార్తీక దీపదానాలు చేశారు.
కాగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శోభయాత్రను నిర్వహించి వేద పండితులు బొజ్జ రమేశ్శర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి హారతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేద పండితులు రమేశ్శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్కుమార్, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, ఆలయ ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, అభిషేక్ పురోహితులు బొజ్జ సంపత్కుమార్ తదితరులున్నారు.