హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. సంబంధిత ధ్రువపత్రాలను ఐఎస్వో ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపాల్ సునీతామోహన్కు అందజేశారు.
నాణ్యతతో కూడిన పోలీసు శిక్షణ, పచ్చదనం, పర్యావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్న హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్థ రెండు విభాగాల్లో ఐఎస్వో 9001-2015 సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కరీంనగర్ పీటీసీ అంతర్జాతీయ ప్రమాణ పత్రాలను సాధించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో హెచ్వైఎం ఐఎస్వో ఎండీ శివయ్య, టీఎస్పీఏ జాయింట్ డైరెక్టర్ కే రమేశ్నాయుడు తదితరులు పాల్గొన్నారు.