కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 2 : కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేనందున ఆ పార్టీ కి రాజీనామా చేసినట్టు యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అజీమ్ ప్రకటించారు. సోమవారం ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడా రు. 2014 నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నానని, పార్టీ కోసం నిరంతరం అంకితభావం తో పని చేసినా తనకు మున్సిపల్ ఎన్నికల్లో టికెటు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇటీవల పార్టీలో చేరిన అభ్యర్థికి టికెట్ కేటాయించి, తనను అవమానించారని వాపోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులను కాంగ్రెస్లో చేర్పించి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. అలాంటి నాయకుల వల్ల పార్టీకి లాభం ఉండదని, వారు ఓడిపోవడం ఖాయమని హెచ్చరించారు.