కేతేపల్లి, నవంబర్ 21 : టీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సోమవారం ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి జెడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, కేతేపల్లి2 ఎంపీటీసీ దాచేపల్లి నర్మద నాగేశ్వర్రావు హైదరాబాద్ మినిస్టర్స్ క్టార్టర్స్లో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
అదేవిధంగా, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల బాబు మహాజన్ ఆధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో కారెక్కారు. వీరందరికీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి చేరుతున్నారని తెలిపారు.
ఏ రాష్ట్రంలో సాధ్యం కాని వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్యాదవ్, నాయకులు పాల్గొన్నారు.