మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మణవాడిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి రూ. కోట్ల కరెన్సీతో అలంకరణ చేశారు. రూ. 10, 20, 50, 100, 200, 500 నోట్లతో అలంకరించారు. దీంతో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారు మహా లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన మొత్తం కరెన్సీ విలువ రూ. 5,55,55,555.55.