ఖానాపురం, డిసెంబర్ 24: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమ్మనగర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి వేటగాళ్ల ఉచ్చుకు ఓ కణుజు చిక్కింది. దాన్ని చంపి కిలోకు రూ.800 చొప్పున 110 కిలోల మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది.
కంజు మాంసాన్ని స్థానికంగానే కాకుండా నర్సంపేటతోపాటు ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించినట్టు సమాచారం. ఇదంతా అటవీ అధికారులకు తెలిసినప్పటికీ ఏమీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.