సిద్దిపేట, సెప్టెంబర్ 21: ఏపీలోని ప్రసిద్ధ కాణిపాకం వరసిద్ధి వినాయకునికి సిద్దిపేటకు చెందిన మురంశెట్టి సంతోష్ సిరిసిల్ల నేతన్నలతో నేయించిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టువస్త్రాన్ని సమర్పించారు.
కాణిపాక ఆలయం ధ్వజస్తంభం దగ్గర ఆయన అగ్గిపెట్టెను విప్పి వస్ర్తాన్ని ప్రదర్శించారు. సంతోష్ తండ్రి మురంశెట్టి రాములు టీడీడీ సభ్యుడు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, తిరుపతికి చెందిన 24 మంది గణేశ్ దీక్షా స్వాములు పాల్గొన్నారు.