కందుకూరు, జూ న్ 13: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూములపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కందుకూరు తహసీల్దార్ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 6, 129, 130, 147, 161, 167, 197, 444, 453, 454, 455, 573, 574, 575 సర్వే నంబర్లలో 135 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నదని వివరించారు.
ఈ సర్వే నంబర్లను రెవెన్యూ రికార్డులతో భూదాన్ రిజిస్టర్లు, 22-ఏ ప్రభుత్వ భూముల రిజిస్టర్లను పరిశీలించగా, సర్వే నంబర్లు 6, 147, 167, 197, 444, 453, 573, 574, 575లో 98 ఎకరాల 21 గుంటల భూ మి భూదాన్ భూమిగా నమోదై ఉన్నదని చెప్పారు. ఈ భూములను ధరణిలో నిషేధిత జాబితాలో పొందుపర్చినట్టు వెల్లడించారు. మిగిలిన సర్వే నంబర్లు 129, 130, 161లో 36 ఎకరాల 23 గుంటల భూములు భూదాన్ రిజిస్టర్లు, 22-ఏ ప్ర భుత్వ భూమి రిజిస్టర్లలో నమోదు కాలేదని తెలిపారు. ఈ సర్వే నంబర్లలో గత 20 ఏండ్ల నుంచి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ధరణిలో భూదాన్ భూములుగా నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ భూములపై సీసీఎల్ఏకి నివేదిక ఇచ్చి, వారి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని చెప్పారు.