నీలగిరి, జూలై 18 : నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వంతెన నిర్మాణం పూర్తయి రెండు నెలలైనా ఎందుకు ప్రారంభిస్తలేరని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం ఆయన ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి వంతెన వద్ద జాతీయ రహదారిపై మెరుపు ధర్నా నిర్వహించారు.
నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అప్పటి ఎమ్మెల్యే కంచర్ల తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా పానగల్, మర్రిగూడ బైపాస్ వద్ద రెండు ఫ్లైఓవర్లను మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యంతో ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన విరమించే ప్రయత్నం చేయగా ససేమిరా అనడంతో పోలీసులు భూపాల్రెడ్డిని, నాయకులను అరెస్టు చేశారు.