TS PR ENC | పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీగా కనకరత్నం నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈఎన్సీ బీ సంజీవరావు ఎక్స్టెన్షన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కనకరత్నానికి ప్రభుత్వం పూర్తిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 1989లో కనకరత్నం సర్వీసులో చేరారు. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ చీప్ ఇంజినీర్ (టెక్నికల్) హోదాలో పనిచేశారు. మరో ఏడాదిపాటు సర్వీసులో కొనసాగనున్నారు. మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ఈ మేరకు కనకరత్నం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఈలు అశోక్, శివకుమార్, ఎస్ఈ సురేశ్ చంద్రారెడ్డి, ఇంజినీర్లు ముజీబ్, సంజీవరెడ్డి, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.