కమ్మర్పల్లి, సెప్టెంబర్ 5: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలో కుల సంఘాలు కదులుతున్నాయి. మంగళవారం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో మాదిగ సంఘం ‘ఏ’ పంథా కూడా మంత్రి వేములకు మద్దతు ప్రకటించింది.
సంఘానికి చెందిన 44 మంది సభ్యులు సమావేశం వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డిని గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.