న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.205 తగ్గి రూ.47,910కి దిగి వచ్చింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,115 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరల స్వల్పంగా తగ్గడం, రూపాయి మారకం విలువ కాస్త బలపడటం ఇవాళ దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. కిలో వెండి ధర కేవలం రూ.61 పెరిగి రూ.70,521కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,460 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,891 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 27.67 అమెరికన్ డాలర్లు పలికింది.