హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్రావు హుటాహుటిన వైద్యశాలకు తరలివెళ్లారు. ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతోపాటు ఇతర ముఖ్య నాయకులతో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్టు బీఆర్ఎస్ వర్గాలు వర్గాలు వెల్లడించాయి.