హైదరాబాద్ : ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లలో ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ కాళేజీ జయంతి జరపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.