కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో రేపు (శుక్రవారం) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం, బీడీఎస్ చివరి సంవత్సరం, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
వాయిదా పడిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్ష ఈ నెల 19న, బీడీఎస్ పెరియోడొంటాలజీ ఈ నెల 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇంగ్లిష్ పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు . అయితే, ఈ నెల 12 నుంచి జరుగాల్సిన పరీక్షలన్నీ యధావిధిగా జరుగుతాయని విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు.