హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): జానపద సంగీత కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ సాయం చేయడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. కళాకారులకు సమున్నత స్థానం కల్పించి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ను కళాపిపాసిగా ఆమె అభివర్ణించారు. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ పద్మశ్రీ అవార్డు అందుకొన్న తెలంగాణ బిడ్డ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి రూ.కోటి అందించి, సత్కరించడం సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శనమని కవిత ట్వీట్ చేశారు.