హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాకతీయ సప్తాహం వేడుకలు సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాకతీయ సప్తాహం వేడుకలను అద్భుతంగా ప్రారంభించిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్కు మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు కాకతీయ రాజుల 700 సంవత్సరాల నాటి సేవలను, సుసంపన్నమైన తెలంగాణ సంస్కృతిని, వారసత్వాన్ని చాటిచెప్తాయని ట్వీట్ చేశారు.