హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 17: టీఎస్ ఐసెట్ను మే 26, 27న నిర్వహిస్తున్నట్టు కన్వీనర్, కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీ వరలక్ష్మి తెలిపారు. తెలంగాణలోని 16 ప్రాంతీయ కేంద్రాల్లో, ఏపీలో 4 కేంద్రాల్లో నాలుగు సెషన్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు.
డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులు కూడా పరీక్షకు అర్హులని తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వివరాలకు https:// icet.tsche.ac.in చూడాలన్నారు.