హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): కాకతీయుల వైభవాన్ని చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా జూలై 7 నుంచి ‘కాకతీయ సప్తాహం ఉత్సవాలు’ నిర్వహించాలని పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాకతీయులు తెలంగాణకు ఎంతో సేవ చేశారని, యావత్ భారతదేశం గుర్తుంచుకోదగిన గొప్ప పాలన అందించారని తెలిపారు. కాకతీయుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ పేరు’తో చెరువుల పూడికతీత కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్చంద్ర భాంజ్దేవ్ను ఆహ్వానించామన్నారు. 700 ఏండ్ల తర్వాత కాకతీయుల వారసుడు వస్తున్న నేపథ్యంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాలలో సాంసృతిక, సాహిత్య, కళ ప్రదర్శనలు నిర్వహించాలని సాంసృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్భాసర్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.