కరీంనగర్;ఓ వైపు ఎండలు మండుతున్నా వ్యవసాయానికి సాగునీరు మాత్రం ఆగడం లేదు. కరీంనగర్ లోయర్ మానేరు నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు వెళ్లే కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తున్నది. ఒకప్పుడు పూడికతో కుంచించుకుపోయిన ఈ కాలువను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరందుతున్నది. ఈ సీజన్లో ఎస్సారెస్పీ అధికారులు విడుతల వారీగా నీటిని విడుదల చేస్తుండగా రైతులు సద్వినియోగం చేసుకొంటున్నారు. ఎల్ఎండీ దిగువన పచ్చని పొలాల మధ్య నిండుగా ప్రవహిస్తున్న కాలువను ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది
– ఫొటో : స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్