హైదరాబాద్ : పెద్దపల్లి-కాచిగూడ స్టేషన్ల మధ్య నడుస్తున్న రెండు రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక నిజామాబాద్ – పందాపూర్, నాందేడ్ – పూనే స్టేషన్ల మధ్య నడుస్తున్న మరో రెండు రైలు సర్వీసుల సమయాలలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.