హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి పలువురు రాజ్యసభ, లోక్సభ సభ్యులు వివిధ పార్లమెంటరీ కమిటీలకు ఎంపికయ్యారు. పరిశ్రమలశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్గా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీకి కూడా చోటు లభించింది. కామర్స్ కమిటీ సభ్యుడిగా టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నియమితులయ్యారు. విద్య, స్త్రీ, శిశు, క్రీడలు, యువజన సర్వీసుల కమిటీకి పోతుగంటి రాములు, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డి, వ్యవసాయశాఖ స్టాండింగ్ కమిటీకి ఎంపీ బీబీ పాటిల్, కోల్ అండ్ స్టీల్ కమిటీకి బడుగుల లింగయ్యయాదవ్, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా మన్నె శ్రీనివాస్రెడ్డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా ఎంపీ జీ రంజిత్రెడ్డి, కార్మికశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్ నియమితులైనట్టు పార్లమెంటరీ బులెటిన్ వెల్లడించింది.