హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్రేప్ ఘటనలో జువెనైల్ బోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. మే 28న సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదుద్దీన్ మాలిక్తోపాటు మరో ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని స్పష్టం చేసి ంది. ఈ ఘటన జరిగే నాటికి నిందితుల వయసు 16 నుంచి 18 సంవత్సరాలుగా ఉన్నదని, ఐదుగురు మైనర్లలో ఒకడు మినహా మిగిలినవారంతా లైంగిక దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు.
తీవ్ర నేరానికి పాల్పడిన ఈ నలుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ నలుగురు మైనర్లను జువెనైల్ బోర్డు ప్రత్యేకంగా విచారించింది. లైంగికదాడికి పాల్పడినప్పుడు నిందితులెవరూ మద్యం సేవించలేదని, ఆ సమయంలో వారి మానసికస్థితి బాగానే ఉన్నదన్న నిపుణుల నివేదికతో మైనర్లు సయ్యద్ నిజాల్ ఫజిలత్, మహ్మద్ కమ్రానుల్లాఖాన్, మహ్మద్ హబీబీ, రహిల్ఖాన్ను మేజర్లుగా పరిగణించాలని బోర్డు తీర్పు వెలువరించింది.