నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): హీరాగోల్డ్లో పెట్టుబడులు పెట్టివారెవరూ భయందోళన చెండాల్సిన అవసరంలేదని, వారికి న్యాయం చేస్తానని ఆ సంస్థ అధినేత నౌహీరా షేక్ హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఆమె బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
తమ విచారణకు హాజరు కాలేదన్న కారణంతో ఈడీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మంగళవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఈడీ విచారణకు హాజరుకావాల్సిన రోజే తాను సుప్రీం కోర్టు విచారణ విచారణకు హాజరు కావాల్సి ఉన్నదని, అందుకే ఈడీ విచారణకు హాజరుకాలేకపోయానని తెలిపారు. నౌహీరా షేక్పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.