హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): మధ్యవర్తిత్వం సున్నితమైన నైపుణ్యంతో కూడిన కళ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ కళలో ఆరితేరుతూ ఉండాలని యువ న్యాయవాదులకు సూచించారు. ఓర్పు, నేర్పు, సౌమ్యం, సరళ విధానాలతో కూడిన మధ్యవర్తిత్వ కళలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్మీడియేషన్ సెంటర్లో తెలంగాణ, ఏపీకి చెందిన యువ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులకు శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఉపన్యసించా రు. న్యాయవివాదాల పరిషార ప్రక్రియకు, మధ్యవర్తిత్వ విధానంలో కేసుల పరిషారానికి ఎంతో వ్యత్యాసం ఉన్నదని చెప్పారు. కేసుల రాజీకి న్యాయవాదులు ఆసక్తి చూపితే ఐఏఎంసీ వంటి మధ్యవర్తిత్వ కేంద్రాల లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. కార్యక్రమంలో ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిఖ్ఖాన్, మధ్యవర్తిత్వ న్యాయవాద నిపుణులు చిత్ర నారాయణ్, జేపీ సింఘ్, ఉమా రామనాథన్, ఏజే జవాద్ తదితరులు పాల్గొన్నారు.