హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్తోపాటు ఇతర సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదని దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగే విచారణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సేల్డీడ్ సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లలో వాయిదాలు గడిచినా కౌంటర్ దాఖలు చేయలేదు.
సానింగ్ చేసిన కాపీలు ధరణి పోర్టల్లో ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు లేవని పేర్కొన్నారు. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరారు. దీంతో ఉన్నతాధికారి వివరణ తెలుకొంటామని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.