హైదరాబాద్ : టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్రెడ్డి నియామకమయ్యారు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్తో సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ (జేఎన్టీయూకు మెకానికల్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఎక్స్పర్ట్), డాక్టర్ విమలా థామస్ (సిద్ధిపేట మెడికల్ కాలేజీ అకాడమిక్ ఎక్స్పర్ట్), జీవీ లక్ష్మణ్రావు (చార్టర్డ్ అకౌంటెంట్-ఫైనాన్స్ ఎక్స్పర్ట్), పీ సుధీర్రెడ్డి ( న్యాయవాది-లీగల్ ఎక్స్పర్ట్), ఓయూ వీసీ (ఇంజినీరింగ్ కోర్స్), కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ వీసీ (మెడికల్ కోర్స్), ఎంజీ యూనివర్సిటీ వీసీ (బీఈడీ-ఇతర కోర్సులు), ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ నుంచి, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆల్ ఇండియా కౌన్సెల్ ఆఫ్ టెక్నికల్ నుంచి ఒకరు, ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీని సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.