హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నూతన చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్డి జస్టిస్ ఏ గోపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో -16ను విడుదల చేశారు. కొత్త కమిటీని ఏర్పాటుచేశారు.
కమిటీ సభ్యులుగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ మం జూర్ హుస్సేన్, సిద్దిపేట మెడికల్ కాలేజీ డైరెక్టర్ విమలాథామస్, చార్టెడ్ అకౌంటెంట్ జీవీ లక్ష్మణ్రావు, అడ్వకేట్ పీ సుధీర్రెడ్డి, ఉస్మానియా వీసీ (ఇంజినీరింగ్ కోర్సులు), కాళోజీ వర్సిటీ వీసీ (మెడికల్ కోర్సులు), మహాత్మాగాంధీ వీసీ (బీఈడీ కోర్సులు) నియమితులయ్యారు. వీరితో పా టు ఉన్నత విద్యామండలి చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియమించిన ప్రత్యేక ఆహ్వానితుడు, ఆర్థికశాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఏఐసీటీఈ, మెడికల్ కౌన్సిల్, బార్ కౌన్సిల్, ఎన్సీటీఈ సభ్యులు (కోర్సులపై విచారణను బట్టి) కమిటీలో ఉంటారని జీవోలో పేర్కొన్నారు.